PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 4:18 am Posted by : gajanandmanthri@gmail.com

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామ శివారులో ఎస్సై ఎ . రాజేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ప్రభుత్వ సంబంధిత శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను గుర్తించి పట్టుకున్నారు.

విచారణలో సదరు ట్రాక్టర్ బూరుగుపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్/యజమాని భూక్యా చంద్రశేఖర్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలడంతో, అతనిపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు భీమారం ఎస్సై ఎ . రాజేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఇసుక, మట్టి తదితర ఖనిజాలను రవాణా చేసే వారు సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతనే రవాణా చేయాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మట్టి రవాణా చేస్తే, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామనిlll హెచ్చరించారు.