బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లోని రెండు స్టేజీలలో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ 2 డిపో మేనేజర్ జిసిసిఎఫ్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొండా అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై నిజామాబాద్ వచ్చి డిఎం ను కలసి వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ కు చెందిన రెండు డిపోల బస్సులతో పాటు నిర్మల్ డిపో బస్సులను ఆపాలని కోరారు. డి ఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గ్రామపంచాయతీ సభ్యులు హమీద్, చిన్న దాస్, సుమలత శ్రీనివాస్, ఖాళీద్, వాహెడ్, అక్బర్, ప్రసాద్ రావు,వీడీసీ సభ్యులు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
