PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:41 am Posted by : Siddenki Ramesh

ప్రజా ఆస్తులపై ప్రజల పోరాటం

మంచిర్యాలలోని హైటెక్ సిటీకీ సంబంధించిన ప్రజా భూములు మరియు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైటెక్ సిటీ ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు చెందాల్సిన భూములపై వెంచర్ యజమానుల అజమాయిషీ, ఆక్రమణ లేదా అనధికార వినియోగం ఉండకూడదు అనే డిమాండ్‌తో ప్రజా ఉద్యమం కొనసాగుతోంది, ప్రజా భూములు ప్రజలకే చెందాలని ప్రజా ఆస్తులకు రక్షణ కల్పించాలి,ప్రజలకు సంబంధించిన భూములపై అక్రమ అజమాయిషీని అడ్డుకోవాలని భూములకు సంబంధించిన వాస్తవ వివరాలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలని,ప్రజల హక్కులను కాపాడేందుకు చట్టపరమైన మార్గాల్లో పోరాటం చేయాలని హైటెక్ సిటీ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని ప్రజల తరఫున పోరాటంలో హైటెక్ సిటీ మాజీ అధ్యక్షులు సురభి రవికుమార్ ప్రజా భూముల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పోరాటం చేస్తున్నారు మాజీ కౌన్సిలర్ & కోఆప్షన్ సభ్యులు తోట తిరుపతి హైటెక్ సిటీ ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. మన హక్కు – మన బాధ్యత ప్రజా భూములు కాపాడాలి…ప్రజల ఆస్తులు పరిరక్షించాలి అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్యంగా అందరూ కలసి కట్టుగా నిలబడాలి, హైటెక్ సిటీ ప్రజల ఐక్యతే మన బలం,మన హక్కుల కోసం, మన కాలని భూముల కోసం అందరం శాంతియుతంగా, చట్టబద్ధంగా, ఐక్యంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు పాల్గొన్నారు.