మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం రోజున మంచిర్యాల గోదావరి నది వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ సేవా సమితి అధ్యక్షుడు కుర్మాచలం మనోజ్ కుమార్, మాట్లాడుతూ హిందువులకు గోదావరి నది ఎంతో పవిత్రమైన ప్రదేశం అని, దానిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గోదావరి నది లో ప్లాస్టిక్ బాటిల్స్, కాళీ సీసాలు, మేకలు, కోళ్ల వ్యర్ధాలను నదీ పరివాహక ప్రాంతాలలో పడవేయవద్దని, స్వచ్ఛ గోదావరి కోసం అందరూ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు