సెప్టెంబర్ 05:
కాగజ్ నగర్ : సెప్టెంబర్ 16 (బుధవారం) ఉ. 9 గం.ల నుండి సా. 5 గం.ల వరకు కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి యువత పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జాబ్ ప్లేసుమెంట్లు పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.