PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:43 am Posted by : PORU TELANGANA

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన…

కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:)

ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు మొక్కజొన్న ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లో భాగంగాదోమకొండ మండలానికి హైదరాబాద్ నుండి ఇక్రిశాట్ సైంటిస్ట్ హర్షవర్ధన్ రావడం జరిగింది. ఐకెపి సిబ్బందితో మాట్లాడుతూ మహిళ రైతులు పండిస్తున్న పంటలను కొనుగోలు మరియు అమ్మకాలు చేస్తున్న క్రమంలో సరియైన ధర పొందడానికి ఈ గోదాంలు ఉపయోగపడతాయి. పంటల సాగు ద్వారా వచ్చే విత్తనాలను ప్రాసెసింగ్ చేసి, ప్యాక్ చేసి మహిళా పారిశ్రామిక వేత్తలను చేయాలని ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉందని తెలిపారు. రెండు యూనిట్లు ఏర్పాటు చేయు స్థలాన్ని పరిశీలించడం జరిగింది. పనులు త్వరగా పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ కుమార్, ఇక్రిశాట్ కో ఆర్డినేటర్లు లక్ష్మీకాంత్, యశ్వంత్, జీజీపీ అశోక్, ఏపీఎం శ్రీనివాస్, పిపీసీ సీఈఓ రవి కుమార్,వివోఏ హేమలత తదితరులు పాల్గొన్నారు.