నెక్కొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే రెండు శుక్రవారం రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. ఆలయ అర్చకులు బివిఎన్ శాస్త్రి ఆధ్వర్యంలో
శ్రీ సూక్త విధానంలో లక్ష్మీ అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహిళలచే వరలక్ష్మీ వ్రతాలు నోమించారు. ఆలయంలో కొలువుతీరిన దేవతామూర్తులకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, అర్చకులు అనుముల గోపాల కృష్ణమూర్తి శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కొంగర హైమావతి శ్రీనివాస్, శ్రీరామలింగేశ్వర సేవా సమితి బాధ్యులు డింగరి శేష పవన్ కుమార్, గన్ను పద్మలత బండి సుజాత గుమ్మడవెల్లి స్వరూప, మారం సునీత, పలుసం పూర్ణ చందర్,అనిత తదితరులు పాల్గొన్నారు.

