విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

Date:

Share post:

📰 Generate e-Paper Clip

    1. విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

సెప్టెంబర్ 4, 2026:

విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా విశిష్ట ప్రతిభ కనబరిచింది. 2025–26లో 43 వేల 72 మంది విద్యార్థులు ఉండగా, 2026–27లో ఈ సంఖ్య 45 వేల 626కు పెరిగి 2 వేల 554 మంది అదనంగా చేరారు. 2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది. జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలలలో 10 శాతానికి పైగా అదనపు నమోదు సాధించగా, మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాలలో 10 శాతానికి పైగా నమోదు పెరిగింది. అలాగే 2026–27లో 4 వేల 346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలలలో చేరడం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎం ఐ ఎస్, సి సి ఓ లు, సి ఆర్ పి ల సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమష్టి కృషి ఈ విజయానికి దోహదపడింది. సెప్టెంబర్ 5న కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ పురస్కారం మంచిర్యాల జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖతో పాటు మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో లభించిన విశిష్ట గుర్తింపు.

 

 

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

నూతన దంపతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులు

బూర్గంపాడు పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామిక వేత పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబంలో ఇటీవల జరిగిన వివాహ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.